వాణిజ్య వార్తలు

రెపో రేటులో కోత విధించిన ఆర్‌బిఐ, బ్యాంకు రుణాల వడ్డీరేట్లు తగ్గే అవకాశం

ఈ సంవత్సరం జూన్‌ నెలలో ఆర్‌బిఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇప్పుడు రెపో రేటు ఏప్రిల్‌లో గతంలో ఉన్న 6.00% నుండి 5.50%కి తగ్గించబడింది. బ్యాంకులకు మునుపటి కంటే తక్కువ భారంతో ఆర్‌బిఐ నుండి డబ్బు లభిస్తుంది. దీని వల్ల ఆర్థిక వ్యవస్థలో మూలధన లభ్యత మరింత సులభతరం అవుతుంది. ఆర్‌బిఐ తన విధాన వైఖరిని అనుకూలం నుండి తటస్థంగా మార్చుకుంది.

బ్యాంకులు వంటి ఆర్థిక సంస్థలు RBI నుండి తీసుకున్న డబ్బుపై విధించే వడ్డీ రేటును రెపో రేటు అంటారు. రెపో రేటు తగ్గినపుడు బ్యాంకులు ప్రయోజనం పొందుతాయి, అవి RBIకి వడ్డీగా తక్కువ డబ్బు చెల్లిస్తాయి. చాలా బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని చివరికి కస్టమర్ రుణాలకు బదిలీ చేస్తాయి. గృహ రుణంను ఉపయోగించే గృహ కొనుగోలుదారులకు ఇది శుభవార్త. సమూలంగా చూసినపుడు EMIలపై వడ్డీ భారం చాలవరకు తగ్గుతుంది. ఇది రుణ గ్రహీతలకు భారీ ఉపశమనంగా చూడవచ్చు.

గత ఫిబ్రవరి మరియు ఏప్రిల్ సమావేశాలలో కూడా రెపో రేటును వరుసగా 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. గత ఆరు నెలల్లో RBI 100 పాయింట్ల భారీ రేటు కోతను అమలు చేసినట్లు మనం గమనించవచ్చు. ఇది బ్యాంక్ కస్టమర్లు పొందిన కొత్త రుణాలపై చాలా ప్రభావం చూపుతుంది. లోన్ కస్టమర్లు మునుపటి సంవత్సరంతో పోలిస్తే లోన్ మొత్తంపై తక్కువ వడ్డీని చెల్లిస్తారు. ప్రస్తుతం ఉన్న రెపో అనుసంధాన రుణాలకు తక్షణమే అమలులోకి వస్తుంది మరియు చెల్లించవలసిన EMIని బ్యాంకులు తగ్గిస్తాయి.

K Anand

An Computer Science and Management Graduate, Interested in economy of India and latest technology.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *